News January 23, 2025

HYD: సెక్రటేరియేట్‌కు వెళ్లే టూరిస్టులపై ఆంక్షలు

image

సచివాలయంకు వచ్చే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై సచివాలయం లోపలకి వెళ్లేవారికి ఇచ్చే పాసుతో ఒక్కరిని మాత్రమే అనుమతినిస్తామని తెలిపింది. సీఎస్ ఫ్లోర్‌లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతోపాటు.. సందర్శకుల సంఖ్యను తగ్గించాలని SPF సిబ్బంది కోరడంతో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 9, 2025

HYD: రమణీయం.. ఈ సూర్యాస్తమయం

image

బుగ్గజాతర రూట్లో ఇవాళ అద్భుతమైన దృశ్యం ఆకట్టుకుంది. తాటిచెట్ల మధ్య సూర్యాస్తమయం కనువిందు చేసింది. చల్లటి గాలులతో కూడిన వాతావరణం జనాలని కట్టి పడేస్తుంది. పట్టణం నుంచి వచ్చే వారు గ్రామీణ వాతావరణంలో ఆనందంగా గడిపేస్తున్నారు. బుగ్గ జాతరకు వెళ్తే జాపాల, ఆరుట్ల, తిప్పాయిగూడ గ్రామాల మీదుగా రాచకొండ ఫోర్ట్‌ను సందర్శించండి. ఈ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అస్సులు మరిచిపోలేరు.

News November 9, 2025

శంషాబాద్: మూడు విమానాలు రద్దు

image

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్‌ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

News November 9, 2025

HYD: ఫ్రాన్స్‌లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

image

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్‌లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.