News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

Similar News

News February 24, 2026

మహిళా శక్తికి 20 ఏళ్లు.. భాగ్యనగరంలో YFLO జోష్!

image

‘ఆడవాళ్లు తలచుకుంటే ఆకాశమే హద్దు’ఇది మాటలు కాదు, 20ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం. యువ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(YFLO) తన 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్‌లో అట్టహాసంగా నిర్వహించింది. ఛైర్‌పర్సన్ పల్లవి జైన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో స్వాతిలక్రా, మహిమాదాట్ల, స్వప్నాదత్ పాల్గొన్నారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యతని చెబుతూ.. గత ఛైర్‌పర్సన్లను సన్మానించి మహిళా సాధికారతే లక్ష్యమని చెబుతున్నారు.

News February 24, 2026

నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఘరానా మోసం: బాధితుడు

image

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్‌ ముందు బైఠాయించారు.

News February 24, 2026

HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

image

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్‌ఎటాక్‌తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.