News March 24, 2025
HYD: సైబర్ నేరగాలపై టీజీసీఎస్బీ కీలక సూచన

HYD: కార్పొరెట్ కంపెనీల్లో అన్లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ శిఖా గోయల్ తెలిపారు. గోయల్ మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారన్నారు.
Similar News
News October 24, 2025
HYD: మూసీ వారధి ఇక సెలవంటోంది! ❣

హైదరాబాదీతో ఆ బంధం తెగుతోంది. 40 ఏళ్లు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చిన మూసారాంబాగ్ పాత బ్రిడ్జి కూల్చివేతతో ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉన్నప్పుడు తెలియదేమో కానీ.. కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలైనప్పటి నుంచి వాహనదారులకు ఆ కష్టాలు తెలుసు. ఊరంతా తిరిగివెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పాతబ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బాగు చేసే అవకాశం కూడా లేక బల్దియా <<18080133>>కూల్చివేతలు<<>> చేపట్టింది.
News October 24, 2025
ఓయూలో ఫలితాల విడుదల

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
SHARE IT
News October 24, 2025
HYD: రామంతాపూర్లో బెట్టింగ్లకు బలైన డిగ్రీ విద్యార్థి

HYD రామంతాపూర్ కేసీఆర్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అరుణ్(18) దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి రజిత ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


