News March 15, 2025

HYD: సైబర్ మోసం.. రూ.1.95 కోట్ల రికవరీ..!

image

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సైబర్ నేరగాళ్ల చేతిలో నుంచి రూ.1.95 కోట్లను రికవరీ చేసింది. HYDలోని ఓ వ్యాపారికి చెందిన ఖాతా నుంచి ఈ మొత్తాన్ని మోసగాళ్లు తరలించారు. కొత్త ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ పేరుతో నకిలీ అకౌంట్‌కు డబ్బు పంపాలని ఓ ప్రత్యేక సందేశం పంపించి కాజేశారు. దీన్ని గుర్తించిన ఆ వ్యాపారి సంబంధించిన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రికవరీ చేశారు.

Similar News

News September 15, 2025

గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.

News September 15, 2025

ఘట్కాలో సత్తా చాటిన కృష్ణా జిల్లా క్రీడాకారులు

image

విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో సెప్టెంబర్ 13, 14 తేదీలలో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి ఘట్కా పోటీలలో కృష్ణా జిల్లా క్రీడా కారులు తమ సత్తా చాటారు. మొత్తం ఏడు బంగారు, ఒక వెండి పతకం సాధించినట్లు జిల్లా ఘట్కా కార్యదర్శి మానికొండ చైతన్య తెలిపారు. పతకాలు సాధించిన 8 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖులు క్రీడా కారులను అభినందించారు.

News September 15, 2025

దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

image

ఒడిశాలో ఓ హాస్టల్‌ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.