News February 1, 2025
HYD: స్వదేశాన్ని విమానంలో చుట్టేద్దాం!

విదేశాల్లో తిరగటం కంటే, మనోళ్లు స్వదేశంలో తిరిగేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల విడుదలైన రికార్డుల్లో తేలింది. AAI రిపోర్టు ప్రకారంగా.. ఒక నెలలో ఏకంగా 22.8 లక్షల మంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు విమాన సర్వీసులో ప్రయాణించినట్లుగా పేర్కొంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏకంగా 90కి పైగా నేషనల్, ఇంటర్నేషనల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News July 11, 2025
GNT: నేడు విచారణకు హాజరు కానున్న అంబటి

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కానున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కోసం నేడు అంబటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు.
News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News July 11, 2025
ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు