News March 17, 2025

HYD: స్వశక్తితో బతకడంతో ఆత్మ గౌరవం పెరుగుతుంది: డీజీపీ

image

వివక్ష లేని సమాజం మహిళల హక్కు, సమానత్వమే మనం వారికి ఇచ్చే గౌరవమని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి భాగస్వామ్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వశక్తితో బతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుందన్నారు.

Similar News

News March 17, 2025

పార్వతీపురం: నేడు పీజీఆర్‌ఎస్‌కు 13 వినతులు

image

పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 13 వినతులు వచ్చినట్లు ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. ప్రజలు దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను తెలిపేందుకు వస్తున్నారని చెప్పారు. వారి సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, వాటి నివేదికను ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

News March 17, 2025

తిరుమల:తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త

image

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించనున్నట్లు ‘X’ వేదికగా టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.

News March 17, 2025

JNTUA 14వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి 2023-24 మధ్య కాలంలో యూజీ (లేదా) పీజీ (లేదా) పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారు తమ ఒరిజినల్ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు https://jntuaebranchpayment.in/originaldegree/ ను సందర్శించాలని సూచించారు.

error: Content is protected !!