News July 29, 2024

HYD: హాస్పిటళ్లకు పెరిగిన డయాలసిస్ పేషెంట్ల తాకిడి..!..!

image

HYD నగరంలో NIMS, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మూడు ఆసుపత్రుల్లో 400-600 మంది వరకు నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ పేషంట్ల మరణాల రేటు HYDలో ఇది 8 శాతం వరకు ఉంటే జిల్లాల్లో 15 శాతం వరకు నమోదవుతోందని వైద్యులు తెలిపారు. అయితే జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు లేకపోవడంతో HYD నగరంలోని ప్రధానమైన 3 ప్రభుత్వ ఆసుపత్రులకు తాకిడి పెరిగింది.

Similar News

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

News October 18, 2025

జూబ్లీహిల్స్ కోసం 40 ‘హస్త్రాలు’

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ 40 అస్త్రాలు ప్రయోగిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. AICC స్టేట్ ఇన్‌‌ఛార్జీ, CM, డిప్యూటీ CM, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో కూడిన 40 మందిని ప్రచారం కోసం నియమించడం విశేషం. ఒక్క MLA స్థానం కోసం కాంగ్రెస్ ఉద్దండులు అంతా బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

News October 18, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: స్టార్ క్యాంపెయినర్లుగా మీనాక్షి, రేవంత్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజ్‌, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. ఇక ఈ మూడు వారాలు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలతో సందడిగా మారనుంది.