News September 6, 2024
HYD: హిందూ యువతపై అక్రమ కేసులెందుకు ?: బండి

జైనూరు ఘటనలో బాధితురాలని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మహిళ ముఖంపై ఉన్న గాయాలు చూసి మనసు చెలించిపోయిందని మంత్రి అన్నారు. మహిళ ప్రాణాల కంటే, ఓవైసీ పర్నిచర్కు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, హిందూ యువతపై ఘర్షణ పేరిట అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని? ప్రశ్నించారు.
Similar News
News January 5, 2026
మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

మొయినాబాద్లోని హిమాయత్నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.
News January 5, 2026
RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
News January 4, 2026
ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

చేవెళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 2 జట్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10, 11న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని వెల్లడించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు.


