News April 8, 2025

HYD: హైకోర్టును ఆశ్రయించిన మన్నె క్రిశాంక్

image

HCU భూములపై AI వీడియోల విషయంలో తనపై నమోదైన కేసుల పట్ల బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 4 FIRలు నమోదు చేశారని, రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ.. పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్‌ను హైకోర్టు ఆదేశించింది.

Similar News

News December 5, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

News December 5, 2025

ప్రజలు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.

News December 5, 2025

జిల్లాలో 1,748 పాఠశాలల్లో మెగా PTM: DEO

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,19,396 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.