News February 19, 2025
HYD: హైడ్రాకు అదనపు కీలక బాధ్యతలు..!

హైడ్రా మరో కీలక బాధ్యతలను చేపట్టబోతుంది. ఇప్పటి వరకు చెరువులు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా, వాటి పరిరక్షణతో బాధ్యతలను సైతం చేపట్టబోతుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇందుకు అవసరమైన నిధులను HMDA నుంచి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 10 చెరువులను ఎంపిక చేసుకొని, పునర్నిర్మానం, అభివృద్ధిపై DPRలు సిద్ధం చేయించింది.
Similar News
News March 27, 2025
NLG: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
బంజారాహిల్స్లో ఇఫ్తార్ విందులో మేయర్ విజయలక్ష్మీ

రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని బంజారాహిల్స్లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ మేయర్, కార్పొరేటర్ కవితా, టి. నారాయణ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు. రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని మేయర్ అన్నారు.
News March 27, 2025
ఖమ్మం: POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా, ఖమ్మం డీసీసీ చీఫ్గా పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాధాకిషోర్, దీపక్ చౌదరి పోటీ పడుతున్నారు.