News January 12, 2025

HYD: హైడ్రాకు ప్రజావాణిలో 83 ఫిర్యాదులు

image

చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, పుట్‌పాత్‌లను పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా దూకుడు పెంచింది. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10వేల ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.  

Similar News

News October 26, 2025

జూబ్లీహిల్స్: సీరియల్ నంబర్లలో 1, 2, 3 కీలకం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీలు, ఇండిపెండెంట్‌లకు ECI పార్టీ గుర్తులు, సీరియల్ నంబర్లను కేటాయించింది. 58 మంది పోటీలో ఉన్నా ముగ్గురే కీలకం కానున్నారు. సీరియల్ నంబర్ 1లో BJP, నంబర్ 2లో కాంగ్రెస్, నంబర్ 3లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లకు స్పష్టంగా తెలిసేలా ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు.

News October 26, 2025

HYD: వారి నెత్తుటితో తడిచిన నేల స్మరిస్తోంది

image

పాషా నరహరి అంటే ఇద్దరు కాదు.. ఒక్కరిగా ప్రజలకు గుర్తు. పేదల పక్షాన పోరాడిన ఈ మహణీయులు మంచాలలోని జాపాలలో జన్మించారు. వీరు పుట్టిన ఊరు చరిత్రలో నిలిచిలా భూస్వాములతో పోరాడారు. 1989లో ఇదే రోజున ఆ వీరులను గూండాలు కాపుగాసి లింగంపల్లి గేటు వద్ద కత్తులు, గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపారు. వారి నెత్తుటితో తడిచిన నేల ఇప్పటికీ వారిని స్మరించుకుంటోంది. నేడు వారి వర్ధంతికి ప్రజలు వారిని గుర్తుచేసుకుంటున్నారు.

News October 26, 2025

HYD: ప్రాణంగా ప్రేమించా.. వద్దంటోంది: సూసైడ్ నోట్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ PS పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. సూసైడ్ నోట్‌లో ‘ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. తనవల్ల పల్సర్ బైక్ పోగొట్టుకున్నా. ఇప్పుడు నన్ను వద్దంటోంది. నాన్న I LOVE YOU మళ్లీ జన్మలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నన్ను క్షమించండి’ అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.