News December 25, 2024

HYD: హైడ్రా కీలక నిర్ణయం

image

హైడ్రాకు ఇప్పటికే దాదాపు 6 వేల ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2025 కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు తాను అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే 7207923085కు వివరాలు పంపొచ్చని తెలిపారు.SHARE IT

Similar News

News November 28, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

image

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్‌షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

News November 28, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

image

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్‌షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

News November 28, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

image

హైదరాబాద్‌లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.