News February 20, 2025
HYD: అగ్నికనిక యాదయ్య యాదిలో 15 ఏళ్లు.!

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికీ 15ఏళ్లు అయ్యింది. 2010లో నేటి రోజున RR జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయస్సులో ఓ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చంచల్గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో..? మన యాదయ్య. జై తెలంగాణ!జై జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News February 21, 2025
HYD: దాడి కేసులో నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులపాటు కస్టడీలో పోలీసులు వీరరాఘవ రెడ్డిని విచారించారు. కస్టడీ ముగియడంతో నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆపై చంచల్గూడ జైలుకి తరలించారు. కాగా.. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
News February 21, 2025
షాద్నగర్: మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావు: మాజీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి హరీశ్రావు కృష్ణాజలాలపై ప్రశ్నిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
News February 21, 2025
కీసర గుట్ట జాతర.. CM రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.