News February 4, 2025
HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్మెన్ మృతి (UPDATE)

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News April 12, 2026
చైనాకు ట్రంప్ వార్నింగ్

ఇరాన్కు చైనా ఆయుధాలు పంపే అవకాశం ఉందన్న అమెరికా <<19628773>>నిఘా వర్గాల<<>> హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. చైనా అలా చేస్తే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్తో చర్చల్లో విజయం తమదేనని అన్నారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అదంతా పట్టించుకోను. గెలిచేది మనమే. నౌకలు మన దేశం వైపు బయల్దేరుతున్నాయి. భారీ ట్యాంకర్లలో చమురు, గ్యాస్ నింపుతున్నాం’ అని చెప్పారు.
News April 12, 2026
సంగారెడ్డి: శివాలయంలో నాగుపాము

హత్నూర మండలం కాసాల గ్రామంలోని వెయ్యేళ్ల పురాతన మల్లన్న శివాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. గర్భగుడిలోని శివలింగంపై పాము పడగవిప్పి ఉండటంతో గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు బారులు తీరారు.
News April 12, 2026
ఎలమంచిలిలో భారీ జాబ్ మేళా.. ఎప్పుడంటే?

ఎలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేళాలో ఫాక్సికాన్, అపోలో టైర్స్, టాటా జాస్మిన్ సహా 8 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా హాజరుకావాలని సూచించారు.


