News February 14, 2026
HYD: అత్తపై అత్యాచారం.. అల్లుడికి 10ఏళ్ల జైలు

నాచారం PS పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి కుషాయిగూడ సెషన్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. 2022లో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు రమేశ్(38)కి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అప్పటి ఇన్స్పెక్టర్ మహేశ్ పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.
Similar News
News February 15, 2026
నెల్లూరు: మల్లెపూలు కాదు.. తెల్లని బంగారమే!

నెల్లూరు జిల్లా కోట మండలంలో మల్లెపూల దిగుబడి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తోటల నుంచి మొగ్గలు రావడం మొదలవ్వడంతో మార్కెట్లో కిలో మల్లెపూల ధర ఏకంగా రూ.1400 పలుకుతోంది. దిగుబడి స్వల్పంగా ఉన్నప్పటికీ, భారీ డిమాండ్ కారణంగా రైతులు వీటిని తిరుపతి, గూడూరు, చెన్నై ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట లేకపోయినా, లభిస్తున్న అధిక ధరతో రైతులు అందినకాడికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
News February 15, 2026
కరీంనగర్ తప్ప కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్కే!

TG: కరీంనగర్ మినహా మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్కే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్లో మేయర్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, MIMకు లైన్ క్లియర్ అయింది. అటు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ అధికారాన్ని పంచుకోనున్నాయి. MBNRలో MIMతో కలిపి కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాలలో హస్తం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది.
News February 15, 2026
విశ్వేశ్వర సముద్రమే.. నేటి ధర్మసాగరం!

జలకళతో అలరారుతున్న ధర్మసాగరం చెరువుకు ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి శాసనాల ప్రకారం.. ఈ చెరువును అప్పట్లో ‘విశ్వేశ్వర సముద్రం’గా పిలిచేవారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన గణప సముద్రం, కేశరి సముద్రం తరహాలోనే దీనికి కూడా శాసనాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల నీటి యాజమాన్య పద్ధతులకు, వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ చెరువు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.


