News September 20, 2025

HYD: అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆసుపత్రుల కిచెన్లు..!

image

హైదరాబాద్‌లోని ఆస్పత్రుల కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ తనిఖీలు నిర్వహించారు. కోఠీ ENT, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, GWH సుల్తాన్ బజార్‌లో అపరిశుభ్రత, ఓపెన్ డస్ట్ బిన్లు, వంట గదిలో డ్రైనేజీ ఫ్లో గుర్తించారు. పరిసరాలు మురికిగా ఉన్నట్లు కనుగొని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి సూపరింటెండెంట్లకు ఆదేశించినట్లు వారు తెలిపారు.

Similar News

News September 20, 2025

H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

image

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.

News September 20, 2025

పీ-4 కార్యక్రమానికి సంధానకర్తలుగా పని చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పీ-4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలకు, మార్గదర్శకులకు సంధాన కర్తలుగా పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో శనివారం పీ-4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర సచివాలయం ఉద్యోగులదేనని పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించాలన్నారు.

News September 20, 2025

ఏలూరు: కోర్టు మానిటరింగ్ సభ్యులతో ఎస్పీ సమీక్ష

image

ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఎస్పీ సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరగాలని ఆదేశించారు. కోర్టు ప్రక్రియను ప్రతిరోజు నమోదు చేయాలని సూచించారు.