News April 5, 2025

HYD: అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య

image

సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుచిత్ర BHEL క్వార్టర్స్‌లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి రాజ్వీర్ సింగ్గాకూర్ (25) శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 7, 2025

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు.!

image

రాజధాని నిర్మాణానికి రూ. 7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రుణం మంజూరుకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అమరావతిలో CM చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. కార్యక్రమంలో NABFID డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.

News November 7, 2025

ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

image

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్‌) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.

News November 7, 2025

ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.