News October 16, 2025
HYD: అయ్యో.. ఆమె బయటపడుతుందా?

HYD మహిళకు 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పునిచ్చింది. బహదూర్పురకు చెందిన మహిళ బ్యూటీషన్ పనికోసం దుబాయ్ వెళ్లడానికి ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేసుకుంది. అతడు ఆమెకు ఓ పార్సిల్ ఇచ్చాడని, ఎయిర్పోర్ట్లో దిగాక అందులో గంజాయి ఉందని కుటుంబీకులు ఆరోపించారు. ఆమెకు 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబపోషణకు వెళ్తే.. జైలుశిక్ష పడిందని ఆమెను కాపాడాలని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం స్పందించింది.
Similar News
News October 16, 2025
బిహార్లో.. రాజు లేని యుద్ధం.. గెలుస్తారా..?

మనం చూడని చరిత్రలో, చూసిన బాహుబలిలో, ఆడే చెస్లో రాజు లేడంటే ఆ యుద్ధం ముగిసి, ప్రత్యర్థి గెలిచినట్లే. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ సహజ విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా వెనకుండి నడిపించిన ఆయన బిహార్లో జనసురాజ్ పార్టీ పెట్టారు. ఇక్కడా తను పోటీ చేయకుండా JSP అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలో సొంత నేతలకే తెలియట్లేదు.
News October 16, 2025
ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 16, 2025
KNR: పోలీసులకు లొంగిపోయిన మేటాఫండ్ నిర్వాహకుడు..?

ఉమ్మడి KNRలో మేటాఫండ్ మనీ సర్క్యూలేషన్ బిజినెస్ నిర్వహించిన HYDవాసి లోకేశ్ KNR పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. KNR, JGTLలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న లోకేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.లక్షకు రూ.3లక్షలు వస్తాయని నమ్మించి ఉమ్మడి జిల్లాలో మేటాఫండ్ పేరిట ట్రేడింగ్ చేసి రూ.వందల కోట్లు లోకేశ్ కొల్లగొట్టాడు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. SHARE