News April 10, 2024

HYD: అర్ధరాత్రి గుడి ముందు MURDER

image

ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

Similar News

News February 20, 2026

HYD: 60% వరకు రాయితీతో బైకులు

image

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్‌, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్‌ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News February 20, 2026

రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

image

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.

News February 20, 2026

HYD: రోజుకు ₹70తో ఇవన్నీ సాధ్యమా?

image

అమీర్‌పేట్ సర్కార్ హోమ్లోని 505 మంది ఇన్‌మేట్స్ కోసం రూ.1.27CRతో మెనూ సిద్ధమైంది. ఆదివారం చికెన్, నిత్యం రాగిజావ, పల్లీలడ్లు, పండ్లు, గుడ్లు ఇవన్నీ రాజభోగంలా ఉన్నా.. నెలకు ఒక్కరికి కేటాయించింది ₹2,100 మాత్రమే. అంటే రోజుకు ₹70 అన్నమాట. దీంతో ఇది సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. గుడ్డు ₹6, పాలు లీటర్ ₹85- 90, గ్యాస్ దాదాపు ₹2వేలు సర్కార్ ఫిక్స్ చేసిన ₹70తో ఇవ్వన్నీ అందించడం కత్తిమీద సామే.