News February 10, 2025

HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

image

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే వారి భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు దీనికి ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.

Similar News

News February 11, 2025

HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

image

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.

News February 11, 2025

HYD: ట్యాంకర్ బుకింగ్ కోసం కాల్ చేయండి

image

వేసవి దృష్ట్యా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించి అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో బుక్ చేసుకున్న రోజే ట్యాంకర్ వస్తుందని, బుకింగ్ కోసం 155313కి కాల్ చేయాలని సూచించారు. దళారులను నమ్మి మోసపొవద్దని హెచ్చరించారు.

News February 11, 2025

HYD: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

HYD ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతున్నట్లు ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి భువనగిరి, కాజీపేట్, పెద్దపల్లి, కాగజ్‌నగర్ వెళ్తుంది. మళ్లీ 15న సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

error: Content is protected !!