News July 19, 2024
HYD: అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు

అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడిపై మహిళలు దాడి చేశారు. దెబ్బలు తాళలేక కుప్పకూలిన అతడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ప్రకాశ్నగర్లో కుమార్(35)ను <<13660377>>చెట్టుకు కట్టేసి కొట్టారు<<>>. మిస్బిహేవ్ చేశాడని విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. RGIA పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News August 15, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో వేం నరేందర్ రెడ్డి జెండా ఆవిష్కరణ

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
News August 14, 2025
రంగారెడ్డి: మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం: జస్టిస్ కర్ణకుమార్

వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా ప్రధాన జడ్జి, DLSA ఛైర్మన్ జస్టిస్ కర్ణకుమార్ అన్నారు. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘మధ్యవర్తిత్వం ఫర్ ద నేషన్’ వేళ మాట్లాడారు. కేసులు వేగంగా, తక్కువ ఖర్చు, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఉత్తమ మార్గమన్నారు. పెండింగ్ కేసులు తగ్గి, న్యాయవ్యవస్థ వేగవంతమవుతుందన్నారు. DLSA కార్యదర్శి శ్రీవాణి ఉన్నారు.
News August 14, 2025
ఎర్రకోటకు మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి

యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి YV రాజుకు అరుదైన గౌరవం లభించింది. 2025 సంవత్సరంలో “ఆత్మ నిర్భర్ పంచాయతీ” విభాగంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని YV రాజుకు ఆహ్వానం అందగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.