News July 17, 2024

HYD: ఆస్పత్రిలో ఎల్బీనగర్‌ MLAకు చికిత్స.. KTR పరామర్శ

image

ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో HYDలోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం ఆస్పత్రికి చేరుకొని MLAను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. MLA కౌశిక్ రెడ్డి, BRS లీడర్ జాన్సన్, సుధీర్ రెడ్డి సతీమణి కమలారెడ్డి ఉన్నారు.

Similar News

News February 9, 2026

రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలు

image

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. RR జిల్లాలోని 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా..వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500-800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి,ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది.

News February 8, 2026

HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.

News February 4, 2026

రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

image

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.