News June 21, 2024
HYD: ఆ ఘటనతో మోదీకి ఏం సంబంధం?: శివాజీ

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏం సంబంధం ఉందని ప్రతి పక్షాలను శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రశ్నించారు. శుక్రవారం HYD హిమాయత్నగర్లోని పార్టీ స్టేట్ ఆఫీస్లో ఆయన మాట్లాడారు. ఎన్టీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడం సరికాదని సూచించారు. విద్యార్థులకు నష్టం చేసే లీకేజీ వ్యవహారాలను ప్రధాని సహించరని అన్నారు.
Similar News
News November 4, 2025
JNTUHలో ఏంటీ పరిస్థితి.. MTechకు తగ్గిన ఆదరణ

MTech కోర్సులకు ఎందుకో రోజురోజుకూ ఆదరణ తగ్గుతోంది. ఆ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. JNTUHలో నిర్వహించిన ఎంటెక్ స్పాట్ అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. JNTUHలో 35 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. అయితే కేవలం 14 మంది మాత్రమే MTech అడ్మిషన్ తీసుకున్నారు. అంటే 21 సీట్లు మిగిలిపోయాయన్నమాట. అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.
News November 4, 2025
FLASH: తాండూరులో RTC బస్సుకు యాక్సిడెంట్

తాండూరు(M)కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూర్ వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా.. మరొకరు గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
News November 4, 2025
జూబ్లీ బైపోల్: ఒకే ఎమ్మెల్యే.. ఎక్కడా తగ్గట్లే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ మొత్తం ఇక్కడే మోహరించింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు.. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎలక్షన్ను రెఫరెండంగా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఆమోదించినట్లేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ గెలుపుకోసం ఆరాటం.


