News January 11, 2026
HYD: ఆ నలుగురు లేకపోయినా!

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.
Similar News
News February 21, 2026
యాదాద్రి: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం..!

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ ఎ.శ్రీనివాస్ రావు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందజేస్తారు. 10 ఏళ్ల అనుభవం ఉన్న నేతలు, 5ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. విజేతలకు రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు. దరఖాస్తులు కలెక్టరేట్లో సమర్పించాలి.
News February 21, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,46,000 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.20వేలు పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 21, 2026
భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.


