News June 23, 2024
HYD: ఆ ఫిర్యాదులూ స్వీకరించాలి: సైబరాబాద్ CP

ఉద్యోగాల పేరుతో మోసాలు, ఇతర వంచనాలకు పాల్పడే నిందితులపై బాధితులు వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులనూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. బాధితులు వ్యక్తిగతంగా వెళ్లి ఫిర్యాదు చేస్తే SHO నిరాకరిస్తున్నారని, పలువురు జర్నలిస్టులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. బైక్ రేసులపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Similar News
News October 25, 2025
ఖైరతాబాద్, శేరిలింగంపల్లికి ఉప ఎన్నిక: KTR

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే రాబోయే GHMC ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని KTR ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ జోస్యం చెప్పారు. TGలోని పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని KTR తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు వివరించాలన్నారు.
News October 25, 2025
HYD: BRSతోనే మరింత అభివృద్ధి సాధ్యం: MLA

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచార వేడి రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి వెంగళ్రావునగర్ డివిజన్ పరిధి మధురానగర్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులతో MLA ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. BRSతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
News October 25, 2025
నా ఫొటో, పేరు చూసి మోసపోవద్దు: CP సజ్జనార్

సైబర్ క్రైమ్ మోసాలపై CP సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘వాట్సాప్లో DPగా నా ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు.’ అని ఆయన ట్వీట్ చేశారు.
SHARE IT


