News July 18, 2024
HYD: ఇంకా ఎంత మంది ఇలా..?
జవహర్నగర్లో కుక్కల దాడిలో విహాన్ చనిపోయిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.గతంలోనూ సాత్విక్, ప్రదీప్ కూడా ఇలానే చనిపోయారు. తనూశ్రీ అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయగా చేతి వేళ్లు తీసేశారు. గ్రేటర్ HYDలో 6లక్షలకు పైగా కుక్కలు ఉండగా ఆపరేషన్లు చేసే సంరక్షణ కేంద్రాలు 5, కుక్కలు పట్టే వాహనాలు 30మాత్రమే ఉండడం గమనార్హం. పదేళ్లలో కుక్క కాటు కేసులు3,36,767 నమోదయ్యాయి. నిత్యం చాలా మంది గాయాలపాలవుతున్నారు.
Similar News
News October 2, 2024
HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!
దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.
News October 2, 2024
HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!
HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఫారంని సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT
News October 2, 2024
HYD: మహనీయులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ అగ్రనేతలు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ అగ్రనాయకులతో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీలకు తెలంగాణ భవన్లో నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, పార్టీ నాయకులు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.