News August 13, 2025
HYD: ఇంజనీరింగ్ వైపు ఆసక్తి తగ్గుతుందా?

ఇంజినీరింగ్ విద్య వైపు ఆసక్తి తగ్గుతుందా? అంటే ప్రస్తుత గుణాంకాలతో అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 55.8% మాత్రమే సీట్ల భర్తీ అయ్యాయి. మిగిలినవి స్పాట్ కౌన్సెలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే 15 శాతానికిపైగా సీట్లు గ్రేటర్ పరిధిలో మిగిలాయి. మరోవైపు B TECH ఇంజినీరింగ్ సీట్లు సైతం మిగలటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
Similar News
News August 13, 2025
ధవళేశ్వరం: ‘నా భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నాడు సార్’

ధవళేశ్వరం బ్యారేజీపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న ఓ యువకుడిని మంగళవారం పోలీసులు కాపాడారు. మనస్తాపంతో బ్యారేజీపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అతని భార్య తన భర్త ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు 112కి ఫోన్ చేసింది. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన బ్యారేజీపైకి చేరుకున్న పోలీసులు అతడిని కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News August 13, 2025
గుంటూరు: అత్యాచారయత్నం కేసులో 5 ఏళ్ల జైలు

2020 ఫిబ్రవరి 4న ఐనవోలు గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం, అక్రమ ప్రవేశం చేసిన కేసులో నులకపేటకి చెందిన బలిమి తిరుపతి రావు(60)పై కేసు నమోదైంది. విచారణ పూర్తి చేసిన గుంటూరు IV అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి-ఎస్సీ/ఎస్టీ కోర్టు ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1,200 జరిమానా విధించింది. తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో నిందితుడికి శిక్ష పడేలా చేశారు.
News August 13, 2025
కావలి నేతకు కీలక పదవి

రాష్ట్రంలో 32 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన బీజేసీ సీనియర్ నేత RD విల్సన్కు కీలక పదవి లభించింది. ఆయనను తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్గా నియమించింది. ఆయనకు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు.