News April 14, 2025
HYD: ఇంజినీరింగ్ కాలేజీల్లో రైడ్స్.. టెన్షన్!

సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 15, 2025
ఉస్మానియా యూనివర్సిటీ PhD పరీక్షల తేదీలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే PhD పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు జరగనున్నాయని, 3 రోజుల్లో రోజుకి మూడు సెషన్స్లలో సబ్జెక్టుల వారిగా తేదీలను ఇప్పటికే వర్సిటీ వెబ్సైట్లో వెల్లడించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://www.ouadmissions.comలో తమ పరీక్ష తేదీని తెలుసుకోవచ్చని తెలిపింది.
News April 15, 2025
HYDలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

HYDలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోయారు. మ.3 తర్వాత వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం లభించిందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశం మబ్బులతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీ, ఖైరతాబాద్, KPHB, ప్యాట్నీ, సికింద్రాబాద్, ఎల్బీనగర్, హయత్నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
News April 15, 2025
హైదరాబాద్: మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం

నగరంలో వర్షం వస్తే వరద నీరు ఎక్కడికక్కడే ఆగపోతుంది. ఈ సమస్య కొన్నేళ్లుగా సిటీని వేధిస్తోంది. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్లను గ్రేటర్ అధికారులు గుర్తించారు. నగరంలో 150 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 65 పాయింట్ల నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేశారు. మిగతా వాటిని త్వరలో పూర్తిచేయనున్నారు.