News March 4, 2025
HYD: ఇంటర్ పరీక్షలు.. ఇది మీ కోసమే!

గ్రేటర్ హైదరాబాద్లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT
Similar News
News March 4, 2025
గతంలో తిరిగిన దారుల్లోనే పులి మరోసారి సంచారం!

గత 20 రోజులకు పైగా పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. కాటారం మండలంలోని గుండ్రాత్పల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నస్తూర్పల్లి అడవుల్లో సంచరించిన పులి.. అన్నారం అడవుల మీదుగా గుండ్రాత్పల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ స్వాతి, పలువురు అధికారులతో కలిసి అడవిలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి గతంలో తిరిగిన దారుల్లోనే తిరుగుతోంది.
News March 4, 2025
పెంచికల్పేట్: వివాహిత హత్య.. భర్తపై అనుమానం!

పెంచికల్పేట మండలం లోడ్పల్లి గ్రామానికి చెందిన <<15640043>>లలిత<<>>(35) సోమవారం హత్యకు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంలో విచారణ చేపట్టినట్లు CI శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా తన అల్లుడు గణేశ్ కొన్ని రోజులుగా తన కూతురిని వేధిస్తున్నాడని, అతడే లలితను హత్య చేశాడని మృతురాలి తల్లి తాను బాయి ఫిర్యాదు చేసిందన్నారు.
News March 4, 2025
బ్లూఫ్లాగ్ రద్దు.. ఇద్దరు అధికారులపై వేటు

AP: విశాఖ రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ హోదా <<15639382>>గుర్తింపు <<>>రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది. బీచ్పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.