News April 25, 2024
HYD: ఇంటర్ FAIL.. అమ్మాయి సూసైడ్

HYDలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదర్గూడ శివనగర్ వాసి శ్రీనివాసరెడ్డి కూతురు హరిణి (16) మెహదీపట్నంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. నేడు విడుదలైన ఫలితాల్లో మాథ్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని శుభకార్యానికి వెళ్ళిన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లి ఇంటికొచ్చే లోపే ఉరేసుకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News April 8, 2026
ఆమనగల్లు: WOW.. వరి నాటుతున్న రాహుల్ గాంధీ, సీఎం

ఆమనగల్లు మండలం చింతలపల్లికి చెందిన చిత్రకారుడు రూపం వెంకట్రెడ్డి వేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతు కుటుంబానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కష్టాలు తెలుసని, రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ ఓకే సారీ అందించి ఆదుకోవాలని కోరుతూ రాహుల్ గాంధీ, సీఎం, రైతులతో కలిసి వరి నాటుతున్నట్లు చిత్రం రూపొందించారు. చిత్రకారుడి చిత్రాన్ని రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.
News April 5, 2026
రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News April 4, 2026
రాజేంద్రనగర్లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.


