News June 28, 2024
HYD: ఇంట్లో బిర్యానీ తిని వెళ్లిన దొంగలు..!
చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోని బిర్యానీ తిని వెళ్లిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బాలాపూర్లోని నాబెల్ కాలనీలో నివాసం ఉండే ఓ నర్సు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగలు బీరువాలోని నగదు, బంగారం, వెండి నగలు చోరీ చేశారు. ఫ్రిజ్లో ఉన్న బిర్యానీని కిచెన్లో వేడి చేసుకుని తిన్నారు. ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News September 23, 2024
సికింద్రాబాద్లో పురాతన అద్భుతమైన టెంపుల్
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
News September 22, 2024
హైదరాబాద్కు వర్ష సూచన⛈️
East HYDకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్నగర్, సైదాబాద్, దిల్సుఖ్నగర్, రామంతాపూర్, అంబర్పేట, మీర్పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
News September 22, 2024
HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.