News September 27, 2024
HYD: ఈడీతో భయపెట్టాలని చూస్తే నడవదు: మహేశ్గౌడ్

బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ రైడ్స్ చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఈడీతో భయపెట్టాలని చూస్తే తమ వద్ద నడవదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Similar News
News December 31, 2025
HYD: వినూత్నంగా సజ్జనార్ న్యూ ఇయర్ విషెస్

న్యూ ఇయర్ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతూనే మద్యం బాబులకు హితవు పలికారు. పరీక్షల్లో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్టే.. కానీ డ్రంకన్ డ్రైవ్ మీటర్లో 35 దాటితే బుక్కయినట్టే. పరీక్షల్లో ఫెయిలైతే ఒక ఏడాదే వృథా అవుతుంది కానీ డ్రైవింగ్లో తేడా కొడితే జీవితమే ఆగం అవుతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా, జాగ్రత్తగా చేసుకోవాలన్నారు.
News December 29, 2025
రంగారెడ్డి జిల్లాలో మరోసారి ఎన్నికలు!

RRలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు నోటిఫికేషన్ వెల్లడైంది.
అమనగల్లు: వార్డులు 15, జనాభా 19,874
చేవెళ్ల: వార్డులు 18, జనాభా 22,713
ఇబ్రహీంపట్నం: వార్డులు 24, జనాభా 30,993
మొయినాబాద్: వార్డులు26, జనాభా 28,196
షాద్నగర్: వార్డులు 28, జనాభా 54,431
శంకర్పల్లి: వార్డులు 15, జనాభా 20,789
News December 23, 2025
RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.


