News July 14, 2024

HYD: ఈత మొక్కలను నాటిన సీఎం

image

గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాలను అందించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తాటి వనంలో ఈత మొక్కలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి నాటారు. అనంతరం కాటమయ్య రక్ష కవచాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Similar News

News February 6, 2026

HYD: ఎందుకమ్మా ఇలా చేశావ్!

image

అమ్మ.. పిల్లలకు ఏ కష్టం రావొద్దని కంచుకవచంలా కాపలా ఉంటుంది. కంటిపాపలకు కీడు కలగొద్దని కోటి దేవుళ్లను కోరుకుంటుంది. అలాంటి విజయశాంతి తన పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడటం సమాజాన్ని కలచివేస్తోంది. మేజర్ అయిన ఆ పిల్లలు అమ్మ మాటకు ఎలా తలొగ్గారు? వద్దని వారించ లేదా? సూసైడ్‌కు ముగ్గురు ఎలా కన్విన్స్ అయ్యారు? అనే ప్రశ్నలు కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

News February 6, 2026

హైదరాబాద్‌ తాజ్‌మహల్‌ గురించి తెలుసా?

image

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్‌’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్‌ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్‌ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.

News February 6, 2026

HYDలో అంతుచిక్కని Mystery!

image

విజయశాంతి సూసైడ్‌ కేసులో మిస్టరీ వీడలేదు. భర్తతో విభేదాలు, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు. మెరుగైన జీవనం సాగిస్తోన్న ఫ్యామిలీ రైల్వే పట్టాలపై మృతదేహాలుగా మారడం అంతు చిక్కడం లేదు. సాంకేతిక ఆధారాలు పరిశీలించగా 2 అఫీషియల్ కాల్స్‌ మాత్రమే ఉన్నాయట. కారులో లభించిన ల్యాప్‌టాప్‌ను సైతం FSLకి పంపారు. అయితే, తల్లితో పాటు పిల్లలు కూడా సూసైడ్‌ చేసుకోవడం వెనుక కారణం ఏంటనే కోణంలో SCR పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.