News May 13, 2024
HYD: ఈవీఎంల మొరాయింపు.. తిరిగి వెళ్లిపోతున్నారు..!

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్నగర్, షాద్నగర్ తదితర చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి ఓటర్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల పనితీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. తాము ఓటేసేందుకు వస్తే ఈవీఎంలు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
HYD: అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

ఇప్పుడు ఏ నోట విన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీభవన్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలంటూ చిట్ చాట్ చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ కూడా మంత్రిగా లేరని, తనకంటే సీనియర్ ఎవరైనా జూబ్లీహిల్స్ నుంచి ఉంటే తాను టికెట్ అడగనంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
News September 13, 2025
కూకట్పల్లి: రేణు అగర్వాల్ను చంపింది వీళ్లే..!

HYD కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్(50)ను ఇటీవల <<17699611>>దారుణంగా హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. యువకులు డబ్బు, నగల కోసం యజమానురాలిని తాళ్లతో కట్టేసి, గొంతులో కత్తితో పొడిచి, ప్రెషర్ కుక్కర్తో తలపై కొట్టి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించగా ఇప్పుడు జైలులో కటకటాలను లెక్కిస్తున్నారు.