News April 7, 2025

HYD: ఈషాసింగ్‌ను అభినందించిన సీఎం

image

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.

Similar News

News April 7, 2025

HYD: రేపు తెలంగాణ భవన్‌లో సమావేశం

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ మహాసభ విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News April 7, 2025

HYD: కంచ గచ్చిబౌలి విచారణ వాయిదా

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, HCU విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News April 7, 2025

బాటసింగారానికి భారీగా వస్తున్న మామిడికాయలు

image

బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కి భారీగా మామిడికాయలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున మామిడికాయలు రావడంతో సీజన్ చివరి వరకు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఒక్కరోజే 300 ట్రక్కుల్లో సుమారు 7వేల టన్నుల పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!