News February 17, 2026
HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.
Similar News
News February 18, 2026
పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.
News February 18, 2026
గుంటూరు DMHO వేటుకు కారణం అదేనా..?

గుంటూరు DMHO బదిలీ అయిన విషయం తెలిసిందే. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలను గుర్తించి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మృత్యువు భారిన పడుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో నేరుగా ఆరోగ్య శాఖ డైరెక్టర్కు ప్రత్తిపాడు MLA రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఔట్సోర్సింగ్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.
News February 18, 2026
మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ తొలి బ్యాటరీ రెంటల్ వాహనం ‘ఈ-విటారా’ SUVని గ్రాండ్గా లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లనుంది. బ్యాటరీ యూజ్ ఎ సర్వీస్ ఓనర్షిప్ కింద ప్రారంభ ధర రూ.10.99లక్షలుగా ఉంది. మొదలవుతుంది. బ్యాటరీ యూసేజ్ రెంట్ ఛార్జీ కి.మీకు రూ.3.99 చొప్పున చెల్లించాలి. ఈవీ లాంచ్తో నిన్న మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి.


