News November 17, 2025

HYD: ఈ ఏరియాల్లో మొబైల్స్ మాయం!

image

నగరంలోని రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్ల వద్ద రెప్ప పాటు క్షణాలలో దొంగలు సెల్‌ఫోన్లు ఎత్తుకుపోతున్నారు. సిటీ పరిధిలో నిత్యం 30-40 మొబైల్ చోరీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.SHARE IT

Similar News

News November 17, 2025

చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.

News November 17, 2025

చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

image

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.

News November 17, 2025

HYD: 3 ప్రమాదాలు.. 25 రోజులు..83 మంది

image

ఒక్కరు.. ఇద్దరు కాదు.. 83 మంది దర్మరణం పాలయ్యారు. కేవలం 25 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల రూపంలో 83 మంది నగర వాసులు, శివారు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో అక్టోబర్ 24న 19 మంది, నవంబర్ 4న చేవెళ్లలో 19 మంది, ఈరోజు తెల్లవారుజామున సౌదీలో 45 మంది దుర్మరణం చెందారు. ఈ మూడు ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ బస్సు ప్రమాదాలే కావడం గమనార్హం.