News July 4, 2024
HYD: ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్మేళా

రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉపాధి శాఖ కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్తంగా ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. HYD ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని చెప్పారు. దాదాపు 17 కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఫోన్: 9494092219
Similar News
News February 19, 2026
HYD: ఇంటి స్థలంలో ప్రభుత్వానికి 5% తాకట్టు!

250 గజాలకు మించి ఉన్న స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలంటే సెట్ బ్యాక్ ఉండాలి. అయితే చాలా మంది ఈ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో 10% స్థలాన్ని స్థానిక సంస్థకు తాకట్టు పెట్టాలి. ఇది గతంలో నిబంధన.. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గిపోవడంతో ఈ రూల్ సవరించాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. 5% తాకట్టు పెట్టి.. భవన నిర్మాణం పూర్తైన తరువాత సెట్ బ్యాక్ ఉందని తేలితే ఆ భూమి రిలీజ్ చేస్తారు.
News February 19, 2026
HYD: రేపటి నుంచి జలమండలి బస్తీబాట

జలమండలి ప్రజలతో మమేకమయ్యే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జలమండలి.. బస్తీ బాట పేరుతో శుక్రవారం నుంచి వారానికి 4 రోజులు బస్తీలు, కాలనీల్లో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించనున్నారు. ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు.
News February 19, 2026
హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి16న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్కి ఉన్న మెజారిటీతో వారి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. VH అధిష్ఠానానికి లేఖ రాయగా, కీలక నేతలూ ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుమార్కు అన్యాయం జరిగిందని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నారు.


