News February 14, 2025
HYD: ఎండాకాలం.. సోడా బండి కష్టాలు..!

ఎండాకాలం సోడా బండి కష్టాలు వర్ణనాతీతం. ఓవైపు భగభగ మండే ఎండ, ఇంకోవైపు పూట గడవాలంటే కష్టపడక తప్పని పరిస్థితి. రోడ్డుపై సోడా బండి లాగుతూ ఓ వ్యక్తి పడుతున్న కష్టాన్ని ఓ ఫొటోగ్రాఫర్ బాలానగర్ ప్రాంతంలో క్లిక్ చేశాడు. కుటుంబ బండిని ముందుకు నడిపించేందుకు సోడాబండిపై ఎంతో దూరం నుంచి HYD వస్తుంటారని తెలిపారు. చెమటోడ్చి కష్టపడుతూ.. సోడాతో దాహార్తి తీర్చే వారికి ఈ ఆర్టికల్ అంకితం.
Similar News
News November 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎయిర్పోర్టు

AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య MOU కుదిరింది. CM CBN, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని CM తెలిపారు. పర్యాటకరంగం వృద్ధి చెందుతుందన్నారు.
News November 15, 2025
మార్చి నాటికి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి: కలెక్టర్

జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశంలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి భద్రత ఉత్సవాల గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.
News November 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 67 సమాధానాలు

ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
జవాబు: విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, భృగు మహర్షి ఆయన వక్షస్థలంపై కాలితో తన్నారు. అప్పుడు విష్ణువు ఏమాత్రం కోప్పడకుండా మహర్షి పాదాలకు క్షమాపణ చెప్పారు. తన నివాస స్థలమైన వక్షస్థలాన్ని ఒకరు కాలితో తన్నినా, విష్ణుమూర్తి అతడిని శిక్షించకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి కోపంతో భూమ్మీదకు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


