News October 15, 2025
HYD: ఎదలోతులో.. ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు..

90‘sలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మనాన్న ఇచ్చిన ఆటానా, చారాణా మనకెంతో గొప్ప. వాటితో స్కూలు గేటు ముందు చాక్లెట్లు, నారింజ మిఠాయి, కొబ్బరుండలు కొనుక్కొని షర్ట్ అడ్డుపెట్టి కొరికి స్నేహితులతో పంచుకునేవాళ్లం. బాల్యంలో చేసినవి గుర్తొస్తే కళ్లవెంబడి నీళ్లొస్తాయి కదా? అబ్దుల్లాపూర్మెట్లోని RNR కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలు గేట్ ముందు కొనుక్కుంటూ కనిపించారు. స్కూల్ లైఫ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్.
Similar News
News October 15, 2025
ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్కు ఫిర్యాదు

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.
News October 15, 2025
KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
News October 15, 2025
అడ్డగోలు NOCలు.. 55 మంది ఇంజినీర్లపై వేటు

HYD పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ NOCలు జారీ చేసిన ఇంజినీర్ల(SE, EE, AEE, DEE) భరతం పట్టింది నీటిపారుదల శాఖ. పైరవీలు, పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన 55 మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉండటంతో వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో ఇతర జిల్లాలకు పంపింది. వారి స్థానాల్లో ఇతర జిల్లాల వారిని ODపై తీసుకొచ్చింది.