News March 19, 2024

HYD: ‘ఎన్నికల ప్రచారం.. అనుమతి తప్పనిసరి’

image

ఎన్నికల ప్రచారం కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుందని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్‌గా అనుమతులు ఇవ్వమని కమిషనర్‌ స్పష్టం చేశారు. 10PM నుంచి 6AM లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దన్నారు.
SHARE IT

Similar News

News September 8, 2025

HYD: అటు ఆనందం, ఇటు ఆర్తనాదం

image

అందరిదేమో ఆనందం.. కొందరిదేమో ఆర్తనాదం. బొమ్మ బొరుసు వలే ఈ రెండు ఉంటాయనడానికి పైఫొటో ఉదాహరణ. ఆదివారం ట్యాంక్‌బండ్‌ మీద నిమజ్జనోత్సవంలో కొన్ని దృశ్యాలు ఉత్సాహం నింపితే, మరికొన్ని గుండెను బరువెక్కించాయి. ఆటపాటల్లో మునిగిన సెక్రటేరియట్ ఎదుట మాసిపోయిన చీర, ఒంటినిండా గాయాలతో ఓ తల్లి భిక్షాటన చేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడు దీనంగా చూస్తుండిపోయాడు. వారి బతుకు చిత్రం చూసి భక్తులు చలించిపోయారు.

News September 8, 2025

వామ్మో: HYDలో 32 వేల టన్నుల వ్యర్థాల తొలగింపు

image

సిటీలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక శానిటేషన్‌పై GHMC ఫోకస్ చేసింది. నిన్నటి వరకు 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించింది. పారిశుద్ధ్య కార్మికులు రోజుకు 1500 నుంచి 1600 టన్నుల చెత్తను సేకరించి, జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. సాగర్‌లో 12 వేల టన్నుల విగ్రహ వ్యర్థాలు బయటపడటం గమనార్హం. ప్రస్తుతం నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాలలో పనులు కొనసాగుతున్నాయి.

News September 8, 2025

HYD: 17 ఏళ్లుగా లడ్డూ సొంతం

image

హెచ్‌ఎఫ్‌నగర్‌ ఫేజ్‌1 బస్తీలో ఓ భక్తుడు 17 సంవత్సరాలుగా వేలం పాటల్లో లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. హెచ్‌ఎఫ్‌నగర్‌ ఫేజ్‌1 బస్తీలో మండపం వద్ద మునేశ్వర్ తొలిసారి రూ. 600 నుంచి చెల్లించి లడ్డూను కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత వరుసగా పదహారు సంవత్సరాలు ఆయనే లడ్డూను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా రూ 2.10 లక్షలకు మరోసారి లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.