News August 13, 2025

HYD: ఎయిర్‌పోర్ట్‌లో మారిన క్యాబ్స్ పికప్ పాయింట్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం క్యాబ్ పికప్ పాయింట్‌ను మార్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ప్రయాణికుల వాకింగ్ దూరాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ పికప్ పాయింట్ గతంలో C పార్కింగ్‌లో ఉండగా ప్రస్తుతం H పార్కింగ్‌కు మార్చారు. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News August 14, 2025

HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునే వారికి మరో అవకాశం

image

అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పలు రకాల సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్టు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను www.braouonline.in సంప్రదించాలని సూచించారు.

News August 14, 2025

HYD: ఏమండోయ్ ఇది విన్నారా?

image

పోలీస్ వస్తుండంటే దొంగ పారిపోయినట్లు ఉంది ఈ కథ. కీసరలో బుధవారం ఒకేసారి మెడికల్ షాపులు మూతబడ్డాయి. స్ట్రైక్ ఏమైనా చేస్తున్నారా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి జనం షాకయ్యారు. మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నాడని షాపులు మూసేయడంతో ముక్కున వేలేసుకున్నారు. నిబంధనలు పాటిస్తోన్న షాపులే లేవా? అని ఆలోచనలో పడ్డారు. మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News August 14, 2025

గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్‌లో రాకపోకలు బంద్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో వేడుకలు జరగనున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
SHARE IT