News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

Similar News

News March 30, 2025

కల్వకుర్తి యువతికి గ్రూప్ 1లో 45వ ర్యాంకు

image

కల్వకుర్తి పట్టణానికి చెందిన యువతి గ్రూప్ 1లో 45వ ర్యాంకు సాధించింది. మెడిసిన్ పూర్తి చేసిన సాహితి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1 సాధించిన ఆమెను పలువురు అభినందించారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా సాహితి మాట్లాడుతూ ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని అన్నారు.

News March 30, 2025

కొత్త సినిమాను ప్రకటించిన పూరీ

image

దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త సినిమాను ప్రకటించారు. విజయ్‌ సేతుపతితో కొత్త మూవీని చేయనున్నట్లు పూరీ కనెక్ట్స్ ద్వారా వెల్లడించారు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్, ఛార్మితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాపయ్యాయి.

News March 30, 2025

పండగల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ సూచన

image

ఉగాది, రంజాన్ సందర్భంగా విశాఖ ప్రజలకు కలెక్టర్ ఎమ్.ఎన్ హరేంధిర ప్రసాద్ ముఖ్యమైన సూచన చేశారు. ఈ రెండు రోజుల క్లాప్ వాహనముల ద్వారా వచ్చే జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. దీంతో వారు చెత్త సేకరణకు రారని తెలిపారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా పబ్లిక్ బిన్స్‌లలో వేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తగా విభజించిన అందించాలన్నారు. 

error: Content is protected !!