News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

Similar News

News March 30, 2025

హైదరాబాద్‌లో రోడ్లు ఖాళీ..!

image

హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఎండ తీవ్రతతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మరికొందరు ఉగాదికి సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో నిత్యం రద్దీగా ఉండే సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాలు బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. మరి మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 30, 2025

HYD: బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

HYDలో బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడింది. బాలానగర్ PS పరిధిలో 2022లో పోక్సో కేసు నమోదైంది. కేసు పూర్తి వివరాలు.. ఫిరోజ్‌గూడకు చెందిన బర్కత్ అలీ(21) ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి అరెస్టయ్యాడు. తాజాగా కూకట్‌పల్లి‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ విక్రమ్‌తో కూడిన ధర్మాసనం దోషిగా తేల్చి, 20 సం.రాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

News March 30, 2025

HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

image

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

error: Content is protected !!