News October 13, 2025
HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.
Similar News
News October 13, 2025
మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కు 32 అర్జీలు

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.
News October 13, 2025
గద్వాల్: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ వ్యాస రచన పోటీలకు ఆహ్వానం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్కు సంబంధించి, విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈనెల 21న వారోత్సవాలు ఉంటాయన్నారు.
News October 13, 2025
ఒంగోలులో CPRపై అవగాహన

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఆర్పై అవగాహన నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రాణాపాయ స్థితి నుంచి సీపీఆర్ ద్వారా మనిషిని రక్షించే చర్యను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రజలకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సీపీఆర్ సమయంలో చేయకూడని పనుల గురించి సైతం వివరించారు.