News October 25, 2025

HYD: ఒక్క రోజులో 8 కేసులు.. రూ.2.55 కోట్లు కొట్టేశాడు..!

image

పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో 500 శాతం లాభం ఇస్తానని ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా 58 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. అనంతరం తన డిజిటల్‌ ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో సంతోషించిన బాధితుడు.. అతడు చెప్పినట్లు రూ.75 లక్షలను పెట్టాడు. ఎంతకీ విత్‌డ్రా కాకపోవడంతో మోసపోయానని బాధితుడు సైబర్‌ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశాడు. కాగా సదరు సైబర్ నేరగాడు ఇలా ఒక్క రోజులోనే 8కేసుల్లో రూ.2.55కోట్లు కొట్టేశాడు.

Similar News

News October 26, 2025

సిరిసిల్ల: నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

మైనారిటీ యువతి యువకుల నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి భారతి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, బౌద్ధ, పార్శి, సిక్కు, జైనుల యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 26, 2025

అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1890: పాత్రికేయుడు, జాతీయోద్యమ కార్యకర్త గణేశ్ శంకర్ విద్యార్థి జననం (ఫొటోలో ఎడమవైపు)
1955: హిందుస్థానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
1965: సింగర్ నాగూర్ బాబు(మనో) జననం (ఫొటోలో కుడివైపు)
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
2005: గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు

News October 26, 2025

నల్గొండ: మద్యం దుకాణాలకు ఈ నెల 27న డ్రా

image

2025- 27కు సంబంధించి నల్గొండ జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4,906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ తెలిపారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక లాటరీ ద్వారా జరుగుతుందన్నారు. డ్రా ప్రారంభ సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా పూర్తిగా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.