News May 11, 2024

HYD: ఓటేసిన వారికి ఆఫర్ అంటూ ఫ్లెక్సీ 

image

HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు. 

Similar News

News November 2, 2025

రంగారెడ్డి: ‘స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు చేసుకోండి’

image

ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.

News October 31, 2025

HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

image

రాజ్ భవన్‌లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

News October 30, 2025

RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

image

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.