News May 13, 2024

HYD: ఓటేసిన 104 ఏళ్ల అవ్వ..!

image

HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు. 

Similar News

News October 7, 2024

సికింద్రాబాద్: FAKE టిక్కెట్లు అమ్ముతున్నారు.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ఉపలబ్ద్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంగా రైల్వే ఫేక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.567 విలువ చేసే లైవ్ టికెట్, రూ.8,409 విలువ చేసే ఇతర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్లు ఆల్రెడీ ఉపయోగించినట్లు గుర్తించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. SHARE IT

News October 7, 2024

HYD: బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గోపిశెట్టి

image

తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. జెల్లి సిద్ధయ్య, మణికొండ వెంకటేశ్వరరావు, మంగళారపు లక్ష్మణ్, ఆత్మకూరి ప్రీతి, పొన్న సునీత పాల్గొన్నారు.

News October 7, 2024

HYD: ఈనెల 14 నుంచి 19 వరకు కౌన్సెలింగ్

image

వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అనుబంధ యూజీ కోర్సులకు ఈనెల 14 నుంచి 19 వరకు HYD రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి తెలిపారు. ప్రతీ రోజు ఉ.9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు www.pjtsau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.