News December 1, 2025
HYD: ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్కు చెందిన ముఖేశ్ పాఠక్పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
Similar News
News March 7, 2026
HYD: అక్రమార్కుల ఆకలికి ‘కూలీ’ల బతుకు తెల్లారింది!

టోలిచౌకిలో బిల్డింగ్ గోవా కూలీ ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన సిటీలో కలకలం రేపింది. కేవలం 3 అంతస్తులకే పర్మిషన్ ఉంటే, 6వ అంతస్తు వరకు స్లాబ్లు వేశారు. DECలోనే నోటీసులిచ్చామని ఆఫీసర్లు బుకాయిస్తున్నారు. ఇస్తే పని ఎలా సాగింది? మామూళ్ల మత్తులో ఉన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామితలయ్యారు. అధ్యక్షురాలిగా పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్పర్సన్గా తొలిసారి ఎన్నికవ్వగా 2005లో వరంగల్ నగర మేయర్గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-25 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.
News March 7, 2026
HYD: మేడం సార్.. మేడం అంతే!

షాద్నగర్కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్లో సివిల్స్లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్నగర్లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.


