News January 19, 2025
HYD ఓయో రూమ్లలో ఉంటూ గంజాయి వ్యాపారం

హైదరాబాదు ధూల్పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News February 27, 2026
ప్రతి పోలీసుకు అండగా ఉంటాం: SP

నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ ఎస్పీ’ (SP-సంపర్క్) కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది సిబ్బంది తమ బదిలీలు, మెడికల్ బిల్లులు, ప్రమోషన్ల వంటి అంశాలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా వివరించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి పోలీస్ వెనుక శాఖ ఉంటుందని భరోసా ఇచ్చారు.
News February 27, 2026
నెల్లూరు: ఈ నంబర్లతో అమ్మాయిలకు రక్ష.!

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్పై నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, కళాశాలల్లో మహిళలు, విద్యార్థినులకు ఈ యాప్ డౌన్లోడ్ విధానం, ఆపద సమయంలో పోలీసుల తక్షణ సాయం పొందే తీరును వివరిస్తున్నారు. దీనితో పాటు డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్లైన్ నంబర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
News February 27, 2026
ఫొక్సో కేసులపై నెల్లూరు SP కీలక ఆదేశాలు

ఫొక్సో కేసులలో అభియోగ పత్రాల దాఖలు వేగవంతం చేయాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్ కేసులలో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం కావాలన్నారు. అందుకు సంబందించి అధికారులకు అవగహన కల్పించారు.


